ఈమద్య ఫేస్ బుక్, వాట్సాప్ లో ఒక వార్త తెగ షేర్ అవుతుంది.అదేంటంటే
ఆడపిల్లలకు శుభవార్త
ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము
ఆడపిల్లలకు అద్భుత మైన పథకం
ఒక సంవత్సరం కు కేంద్ర ప్రభుత్వం Rs.24,000/- ఇస్తుంది.
అర్హతలు
1. ఆడ పిల్లలు వయస్సు 5 సంవత్సరం ల నుండి 18 సంవత్సరo లోపల కలిగి ఉండాలి.
2. అమ్మాయి పుట్టిన తేది
నమోదు చేయాలి.
3. తండ్రి ఆదాయము సంవత్సరం కు 2,00,000/- దాటకూడదు
4. తండ్రి ఆధార్ కార్డు, మరియు ఆడపిల్ల ఆధార్ కార్డు నెంబర్ లు నమోదు చేయాలి.
5. అమ్మాయి చదువు కుంటుంటే -ఏ స్కూల్ లో, లేక కాలేజ్ వివరములు నమోదుచేయాలి.
6. తెల్లరేషన్ కార్డ్ నెంబర్ కూడా నమోదు చేయాలి.
7. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ నమోదు చెయ్యాలి.
24,000/- నేరుగా మీ బ్యాంక్ ఖాత లో జమ అవుతాయి.
ఈ వివరములు అన్నీ కూడా "కామన్ సర్వీసు సెంటర్" నందు నమోదు చేసుకోవాలి.
ఆడపిల్లలు అందరూ కూడా ఈ అవకాశమును తప్పకుండా సద్వినియోగము చేసుకోగలరరు.
చాలామంది ఇది నిజమా కాదా తెలియకుండానే అందరికీ షేర్ చేస్తున్నారు.
అసలు నిజానికి ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పేరుతో ఎలాంటి ప్రభుత్వ పతకం లేదు. ఆ పథకం గురించి కేంద్రం ఎప్పుడూ ఎక్కడా పేర్కొనలేదు.
సో అందరూ తొందరపడి ప్రతి విషయాన్ని నమ్మకండి, మీకు నిజం తెలియనపుడు అటువంటి వార్తలను షేర్ చేసి ఇబ్బందులు తెచ్చుకోకండి
No comments:
Post a Comment